బీసీ, ఎంబీసీ కులవృత్తిదారులకు శనివారం నుంచి లక్ష ఆర్థిక సాయం అందించేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరు వరకు నియోజకవర్గానికి 300 మంది చొప్పున.. వికారాబాద్ జిల్లాలో 1200 మందికి సాయం అందించనున్నారు. ఇప్పటికే జాబితాను సిద్ధం చేయగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జూన్ 20 వరకు ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా, జిల్లావ్యాప్తంగా మొత్తం 13,157 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ఇప్పటివరకు 9607 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 409 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉన్నది. గత నెలలో జిల్లాలో 20 మంది బీసీ కులవృత్తుల వారికి సాయం అందజేయగా.. ఈ నెల మరింత మందికి అందిస్తున్నారు. ఇలా నెలనెలా అర్హులందరికీ సాయం అందించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటున్నది.
వికారాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాలకు నేటి నుంచి ఆర్థిక సాయం అందనున్నది. ఒక్కో నియోజకవ ర్గంలో 300 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్ల కురుమలు, మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి తోడ్పాటునందించిన బీఆర్ఎస్ ప్రభు త్వం బీసీ కులాలు, చేతివృత్తుల వారి నిమిత్తం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత నెల నుంచే అర్హులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిం ది. గత నెలలో వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో 20 మంది బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష చొప్పున అందించారు. అయితే అర్హులకు జూన్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తదనంతరం దరఖాస్తుల వారీగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేశారు. బీసీ కుల, చేతివృత్తులకు చెందిన వారు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అం దిస్తున్నది. ఈ సాయాన్ని కుటుంబం లో ఒకరికి మాత్రమే ఇస్తు న్నారు. ఈ పథకానికి 18 నుం చి 55 ఏండ్లలోపు వారే అర్హులని, గ్రామాల్లో 1.50 లక్షల్లో పు.. పట్టణాల్లో రూ.2లక్షల్లోపు వా ర్షిక ఆదాయం ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలుపుతున్నారు.
నేటి నుంచి అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆర్థిక సాయం అందనున్నది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో (వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్) నియోజకవర్గానికి 300 మంది చొప్పున నాలుగు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 1200 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సా యాన్ని ఈ నెలాఖరు వర కు ఎమ్మెల్యేలు అందించనున్నారు. అయితే గత 20 తేదీ వరకు 13,157 మంది బీసీ కులవృత్తు లు, ఎంబీసీ కులాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించి 3,141 మందిని అనర్హులుగా గుర్తించి, మరో 9,607 మం దిని అర్హులుగా ఎంపిక చేశారు. అయితే మరో 409 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉన్నది. అర్హుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి అందజేయగా మొదటి విడుతగా 3,387 యూనిట్లకు ఆమోదం తెలిపింది.
బంట్వారం మండలంలో 207 మంది, బషీరాబాద్లో 528, బొంరాస్ పేటలో 645, ధారూరులో 386, దోమలో 623, దౌల్తాబాద్లో 496, కొడంగల్లో 437, కోట్పల్లిలో 274, కులకచర్లలో 687, మర్పల్లిలో 425, మోమిన్పేటలో 242, నవాబుపేటలో 433, పరిగిలో 617, పెద్దేముల్లో 584, పూడూరులో 662, తాండూరులో 352, వికారాబాద్లో 367, యాలాలలో 485, వికారాబాద్ మున్సిపాలిటీలో 557, తాండూరు మున్సిపాలిటీలో 389, పరిగి మున్సిపాలిటీలో 81 మంది, కొడంగల్ మున్సిపాలిటీలో 130 మందిని అర్హులుగా జిల్లా యంత్రాంగం తేల్చింది. బీసీ కులాల్లోని 14 కులవృత్తులైన నాయీబ్రాహ్మణులు, రజక, సగర, కుమ్మరి, ఆవుసుల, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర, ఆరెకటిక కులాలతోపాటు ఎంబీసీకి చెందిన 36 కులాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందనున్నది.
బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాల్లోని అర్హులైన వారికి నేటి నుంచి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందనున్నది. ఈ సాయం దశలవారీగా ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. జిల్లాలో 1200 మంది అర్హులకు అందనున్నది.
– నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టర్