శంకర్పల్లి, జనవరి 11 : పండుగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సంక్రాంతి సంబురాలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. విద్యార్థులు రకరకాల ముగ్గులు వేసి అలరించారు. చైర్పర్సన్ విద్యార్థులకు పతంగులను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్వేతాపాండురంగారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
షాబాద్ మండల కేంద్రంలో..
షాబాద్, జనవరి 11: సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేలా పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని హోఫ్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్కుమార్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 80 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, రవీందర్, ఉపాధ్యాయులు డేవిడ్రెడ్డి, రాజేశ్వరి, రియాజ్, బాలకృష్ణ, ఆంజనేయులు, వసుంధర, హోప్ ఫౌండేషన్ సభ్యులు మల్లికార్జున్, ప్రదీప్. ప్రవీణ్రెడ్డి, షపీ, ఎండీ అడ్డు, విద్యార్థులు పాల్గొన్నారు.