కొడంగల్, జూన్ 25 : మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూనిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు రూ.20 లక్షలు కాకుండా రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ప్యాలమద్ది, పెద్దనందిగామ గ్రామాల్లో సర్పంచ్లు యాసరోద్దిన్, చెన్బస్కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు భూసేకరణలో భాగంగా గ్రామసభలు నిర్వహించారు. కొడంగల్లో 75 మంది రైతులకు చెందిన 27ఎకరాల 20 గుం టలు, ప్యాలమద్దిలో 95 మంది రైతులకు చెం దిన 43 ఎకరాల 37 గుంటలు, పెద్దనందిగామ గ్రామంలో 75 మంది రైతులకు చెందిన 39ఎకరాల 20 గుంటలను సేకరిస్తున్నట్టు అధికారు లు చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నష్టపరిహారాన్ని పెంచితే తమ భూములను ఇస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.20 లక్షలు చెల్లిస్తే భూమితో పా టు ఉపాధినీ కోల్పోతామన్నారు. ఇతర ప్రాం తాల్లో భూమిని కొనాలంటే రూ.80 లక్షలకు పైగా ధర ఉన్నట్టు పేర్కొన్నారు. మార్కెట్ ధర ప్రకారం రూ.80 లక్షలు చెల్లిస్తే మరో చోట భూమిని కొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తామన్నారు. లేదంటే భూములు కోల్పోయి ఉపాధి లేక.. నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుందన్నారు. భూసేకరణలో అధిక మొత్తం లో భూమిని కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకం కెనాళ్ల పనులను పొలాల మధ్య నుంచి కాకుండా పొలాల అంచుల్లో చేపడితే మిగిలిన కొంత భూమిలోనైనా వ్యవసాయం చే సుకుంటామని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
భూసేకరణలో భాగంగా రైతులు తమ సమస్య లపై దరఖాస్తులిస్తే వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. 30 రోజు ల వరకు రైతులు కొడంగల్ తహసీల్దార్, తాం డూరు ఆర్డీవో కార్యాలయాల్లో అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. రైతులు అందించిన దరఖాస్తులను పరిశీలించి మరోసారి క్షేత్రస్థాయిలో సర్వేతోపాటు పరిశీలించడం జరుగుతుందన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కొడంగల్ నియోజకవర్గంలో 1400 ఎకరాల ను సేకరించడం జరుగుతుందని.. కెనాళ్ల నిర్మాణంతోపాటు ప్రతి 450 ఎకరాలకు ప్ర త్యేకంగా ట్యాంకులను ఏర్పాటు చేస్తారన్నారు. కొడంగల్ మండలంలోని కొడంగల్, ప్యాలమద్ది, పెద్దనందిగామ గ్రామాల్లో భూసేకరణకు సర్వే పూర్తి కాగా, అభిప్రాయ సేకరణకు సమావేశాలు నిర్వహిస్తున్నమన్నారు. మక్తల్ నుంచి బొంరాస్పేట వరకు 108 కిలోమీటర్ల దూరంగా కెనాల్ నిర్మా ణం జరగనున్నదని, 53 వేల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అనిత, తహసీల్దార్ రాంబాబు, కృష్ణమోహన్, శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.