ఆదినుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ మరోసారి ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ పంట నష్టపోయినా ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించగా.. శుక్రవారం నిధులను విడుదల చేసింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 2510 మంది రైతులకు చెందిన 3,399 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.3,39,91,750లను జిల్లా వ్యవసాయ శాఖ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటికే పంట నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు సేకరించారు. రెండు, మూడు రోజుల్లో నేరుగా బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. కష్టకాలంలో నష్టపరిహారం అందిస్తూ అండగా నిలువడంపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిం ది. రెండు, మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతా ల్లో డబ్బులు జమకానున్నాయి. ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పంట నష్టపోయిన రైతులకు
ఇవ్వని విధంగా సర్కార్ అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. పంటలను సాగు చేసుకునేందుకు రైతుబంధు కింద ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున ఏడాదికి రూ. పది వేలను మంజూరు చేస్తున్నది. అంతేకాకుండా పంట రుణాల మాఫీ, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ తదితర రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దనే ఉద్దేశంతో వారిలో భరోసా నింపేందుకు చర్యలు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులకు ఎకరానికి రూ.పది వేల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
రెండు, మూడు రోజుల్లో జమ..
గత నెలలో కురిసిన వడగండ్ల వానతో వికారాబాద్ జిల్లాలో 2,510 మంది రైతులకు చెందిన 3,399 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు నష్ట పోయాయి. అధికారులు అందజేసిన పంట నష్టం నివేదిక ఆధారంగా 3,399 ఎకరాలకు సంబంధిం చి ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ. 3,39,91,750లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖ బ్యాంకు ఖాతా లో జమ చేసింది. ఈ డబ్బును పంట నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు రెండు, మూడు రోజుల్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని జమ చేయనున్నారు. అయితే జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అధికంగా పంట నష్టం జరిగింది.
1,200 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నష్టపోగా.. మిగతా 2,1 99 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. వడగండ్ల వానతో మామిడి, పూలు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూల పంటలకు సంబంధించి 230 మంది రైతులకు చెందిన 226 ఎకరాల్లో పంట నష్టపోగా, మామిడి పంట 150 మంది రైతులకు చెందిన 323 ఎకరాల్లో నష్టం జరిగింది. ఉద్యా న పంటల్లో మోమిన్పేట మండలంలో 499 ఎకరాల్లో .. మర్పల్లి మండలంలో 947 ఎకరాలలోనష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మ రోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని విడుదల చేయడంపై జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.పది వేల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించడంతోపాటు వ్యవసాయ శాఖ బ్యాంకు ఖాతాలో ప్రభు త్వం డబ్బులను జమ చేయడం చాలా సం తోషకరం. సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే దానిని కచ్చితంగా నెరవేర్చుతారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆరే. పంట నష్టపోయిన రైతులకు రూ.పది వేల చొప్పున పరిహారాన్ని చెల్లించడం చరిత్రలోనే మొదటిసారి.
– రెడ్డిపల్లి దుర్గయ్య,టేకులపల్లి, మోమిన్పేట
పరిహారాన్ని చెల్లించడం హర్షణీయం
సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో ముం దుకు సాగుతున్నారు. ఇందుకోసం రైతుబంధు, ఉచిత కరెంట్, రైతుబీమా వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేసి అన్నదాతల మన్ననలు పొందుతున్నారు. సొసైటీల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించడంతోపాటు సాగు చేసిన పంటలకు మద్దతు ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల మండలంలో కురిసిన అకా ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.పది వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించడం హర్ష ణీయం. రైతుల కష్ట సుఖాల్లో ముందుంటున్నారు సీఎం కేసీఆర్.
– శ్రీకాంత్గౌడ్, మర్పల్లి ఏఎంసీ చైర్మన్
రైతులకు ఆసరాగా ఉంటుంది
నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించ డం ద్వారా రైతులకు ఎంతో ఆసరాగా ఉంటుంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు పంటలు చాలా వరకు దెబ్బతిని రైతులకు నష్టం జరిగింది. నేను నాలుగు ఎకరాలలో సాగు చేసిన అరటి పంట వడగండ్ల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది. సీఎం కేసీఆర్ ఎకరానికి రూ. పది వేల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించడంతోపాటు నిధులను మంజూరు చేయడం చాలా సంతోషకరం
– పి.రెడ్డి, సైయ్యద్అలీపూర్,మోమిన్పేట
రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటున్నది. మండలంలో గత నెలలో కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.పది వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించడం హర్షణీ యం. దాని ద్వారా పంట నష్టపోయిన అన్నదాతలకు కొంత భరోసాగా ఉంటుంది. – కిరణ్, ఎన్కతల, మోమిన్పేట