పరిగి, జూన్ 27 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రంగాపూర్ రైతువేదికలో మేలు రకాలైన పీఆర్జీ 176, ఎల్ఆర్జీ 52 కంది విత్తనాలను ఎంపీపీ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత విత్తనాలు, ఎరువులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సకాలంలో రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉంచుతున్నదన్నారు.
గత పాలకుల హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వార న్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు పెట్టుబడి సహాయంగా రైతుబంధు కింద ఎకరాకు సంవత్సరానికి రూ.10వేలు అందిస్తున్నదన్నారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని సూచించారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ డీఎస్ లక్ష్మీకుమారి, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, సయ్యద్పల్లి సర్పంచ్ వెంకట్ రామకృష్ణారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్, జూన్ 27 : సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటున్నారని పెద్దేముల్ గ్రామ సర్పంచ్ ద్యావరి విజయమ్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు ప్రభుత్వం అందించే ఉచిత విత్తనాలు కందులు, మినుముల మినీ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఏఈఓ వినయ్ మాట్లాడుతూ మండలానికి 60 క్వింటాళ్ల కం దులు, మినుముల విత్తనాలు రాగా అందులో పెద్దేముల్ క్లస్టర్కు 11 క్విం టాళ్ల 40 కిలోల విత్తనాలు వచ్చాయని, ఎకరానికి ఒక రైతుకు ఒక పట్టపాసు పుస్తకానికి నాలుగు కిలోల ఉచిత విత్తన మిని బ్యాగును అందిస్తున్నామన్నారు. రైతులు విత్తనాలు విత్తుకొన్న అనంతరం తమ పంటల వివరాలను ఆయా గ్రామాల ఏఈఓలను సంప్రదించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో మాజీసర్పంచులు ఎర్రబాలప్ప,కిషన్రావు,రైతులు వీరన్న,నర్సిరెడ్డి,చాకలి రాములు, ఎం. రాములు, శ్రీనివాస్,మక్బూల్ ,బందెప్ప,అనంతయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు