ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉన్నది. బోరుబావిలో నీరు సమృద్ధిగా ఉందని భావించి ఈ యాసంగిలో రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు. అయితే భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న బోరు వట్టిపోయి వేసిన పంట ఎండిపోతున్నది. పంటను కాపాడుకునేందుకు బోరు తవ్వించినా ఫలితం లేదు.
ట్యాంకర్ ద్వారా పొలానికి నీటిని అందించాలనుకున్నా.. పెరిగిన ట్యాంకర్ల ధరను భరించలేక, మరింత అప్పుల భారం మోయలేక ఎండిపోతున్న పంటను కోసి పశువులకు దాణాగా వేస్తూ కన్నీరు మున్నీరవుతున్నాడు.
-ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 8