షాబాద్/బొంరాస్పేట, మే 30 : రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’ పేదల కండ్లల్లో వెలుగులు నింపుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కంటి శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది. కండ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుండడంతో జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం 10,674 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 490 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 581 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. వికారాబాద్ జిల్లాలో 00000 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 0000 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. 000 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. అక్కడ వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులతోపాటు అద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం 80 బృందాల ద్వారా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 10,674 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 490 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 581 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 3,886 మందికి కంటి పరీక్షలు
వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా సాగుతున్నా యి. శిబిరాలకు ప్రజల నుం చి మంచి స్పందన వస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం జిల్లాలో 3,886 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. వారిలో 444 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేయగా.. 334 మందికోసం ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 521 గ్రామాలు, 93 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.