ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. రోజురోజుకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఏ ఊరికెళ్లినా జనం నీరాజనం పలుకుతున్నారు. డప్పుచప్పుళ్లు, యువతుల బోనాలు, హారతులతో అభ్యర్థులకు అపూర్వ స్వాగతం లభిస్తున్నది. శనివారం మొయినాబాద్ మండలంలోని మేడిపల్లి, చిన్నమంగళారం, మోత్కుపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, షాద్నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రచారం చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో బాగుందంటూ ప్రజలు ప్రశంసలు కురిపించారు. కారు గుర్తుకే ఓటు వేస్తామంటూ మద్దతును తెలిపారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
తలకొండపల్లి, అక్టోబర్21: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే, కల్వకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రావిచేడ్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 50 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నిర్మల, ఎంపీటీసీ సరిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్లు గోపాల్నాయక్, లక్ష్మణ్నాయక్, ఈశ్వర్నాయక్, నాయకులు గణేశ్గుప్తా, రాఘవేందర్గౌడ్, శ్రీశైలంయాదవ్, శేఖర్, ఆంజనేయులు, స్వామిగౌడ్ పాల్గొన్నారు.
కడ్తాల్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలదేనని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని కర్కల్పహాడ్, ముద్విన్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 165, 169, 170, 206, 207, 208 బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి జైపాల్యాదవ్ గెలిపించుకుందామని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్న మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీ లచ్చీరాంనాయక్, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, నాగమణి, ఉప సర్పంచ్ ఎల్లాగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, : నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోనే సాధ్యమని ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎన్నికలు రాగానే ఎక్కడలేని మాటలు మాట్లాడుతూ..రెచ్చగొడుతున్న పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దని కోరారు. సమావేశంలో మడుపు వేణుగోపాల్రావు, మొద్దు అంజిరెడ్డి, తాళ్ల మహేశ్గౌడ్, కేవీ రమేశ్రాజు, బర్తాకి జగన్, యాచారం రవీందర్, ముత్యాల చిన్న, నీలం బాలు, కర్నె అరవింద్ పాల్గొన్నారు.
మంచాల : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. శనివారం మండలంలోని బోడకొండ, చిత్తాపూర్, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిషన్రెడ్డి గెలు పు కోసం నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పక్షపార్టీలకు చెందిన నాయకులు ఎంత ప్రచారం నిర్వహించినా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన కిషన్రెడ్డికే ప్రజలు ఓటు వేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కిషన్రెడ్డిని గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో బహదూర్, ఏర్పుల చంద్రయ్య, పుల్లారెడ్డి, పెంట్యా నాయక్, దండేటికార్ రవి, రఘునాయక్, ప్రభాకర్, జానీపాషా, పరమేశ్, మహేందర్, పద్మారెడ్డి, అశోక్, శివ, రాజేశ్ పాల్గొన్నారు.