తాండూరు, జనవరి 20 : వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం ఎక్సైజ్ పోలీసులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్-ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా తమిళనాడుకు చెందిన పీటర్ ఫ్రాన్సెన్ అనే వ్యక్తి దగ్గర 40 కేజీల గంజాయి లభించినట్లు తెలిపారు.
గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు వివరించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు ధన్వంత్రెడ్డి, అనంతయ్య, కోటేశ్వర్రావు, చంద్రకాంత్రెడ్డి, చిన్నరాముడు తదితరులు ఉన్నారు.