Shadnagar | షాద్నగర్, జూన్ 29 : ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ఆదివారం పరామర్శించారు. గత నాలుగు రోజుల క్రితం రాంబల్నాయక్ తండ్రి గోప్యనాయక్(80) మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న హరీష్రావు కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట గ్రామ పరిధిలోని పొడగుట్టతండాకు చేరుకొని రాంబల్ నాయక్ను పరామర్శించి ఓదార్చారు. ఈ సదర్భంగా గోప్యనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు.
రాంబల్నాయక్ను పరామర్శించినవారిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వై.అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ యువ నాయకుడు వై.రవీందర్యాదవ్ ఉన్నారు.
ఇందులో భాగంగా ఎక్లాస్ఖాన్పేట గ్రామ శివారులో మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్రావుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కేశంపేట, ఫరూఖ్నగర్ మండలాల అధ్యక్షులు మురళీధర్రెడ్డి, లక్ష్మణ్నాయక్, మాజీ జెడ్పీటీసీ పల్లె నర్సింగ్రావు, షాద్నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, సీనియర్ నాయకులు వి.నారాయణరెడ్డి, దేవేందర్యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, శ్రీధర్రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.