ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 18 : బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. స్థానికంగానే ఉంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తిరుగుతున్నారు. గడప గడపకూ వెళ్తూ ఓటర్లతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అభ్యర్థులకు ప్రజలు హారతులిచ్చి ఘనస్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ మద్దతుగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. అడుగడుగునా జనం ఎదురొచ్చి ‘మా ఓటు.. కారుగుర్తుకేనంటూ’ హామీ ఇస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యేల సమక్షంలో స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటూ మరోసారి గెలిపించుకుంటామని పలువురు బీఆర్ఎస్లో చేరినవారు శపథం చేస్తున్నారు.
ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు వచ్చి అమలుకాని హామీలనిచ్చే రాజకీయ పార్టీలు, నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేశ్తో కలిసి ఇబ్రహీంపట్నంలో ఏర్పాటుచేసిన మున్సిపాలిటీ బీఆర్ఎస్ బూత్ కమిటీల నాయకుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి త్వరలోనే ఏర్పాటు కానుందని, ఇబ్రహీంపట్నంలో ఆర్డీవో కార్యాలయం, పంచాయతీరాజ్ డీఈ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ పూర్తిస్థాయిలో సరిపడా తాగునీరు అందిస్తున్నామన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నానికి మినీ స్టేడియం కూడా రానున్నదని తెలిపారు. ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని, చెరువుకట్టపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున బైపాస్ రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు.
మత్స్యకారుల కోసం రూ.2 కోట్లతో శేరిగూడ సమీపంలో చేపల మార్కెట్ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. పాత ఇబ్రహీంపట్నం కూడా అభివృద్ధి చేయాలనే పాతబస్టాండులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నామని, పాత ఇబ్రహీంపట్నం రాయపోల్, నాగన్పల్లి రూట్లో కూడా రోడ్డు విస్తరణ చేసుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో పోటీచేసే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారన్నారు. మల్రెడ్డి రంగారెడ్డిలాంటి ఊసరవెల్లి రాజకీయాలు నమ్మవద్దని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కష్టపడి పని చేయాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : 40 రోజుల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు అన్నారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడ గ్రామంలో బీఆర్ఎస్ బూత్స్థాయి కార్యకర్తలు, నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ గీతా రాంరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తాళ్ల హరిప్రసాద్గౌడ్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, నాయకులు మైసయ్య, గణేశ్, లింగం, శివప్రసాద్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి
యాచారం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్రెడ్డిని నాలుగోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ అన్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బూత్ స్థాయి కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్లో నేటికీ టికెట్ల లొల్లి నడుస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బాషా, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ శివలీల, ఉపసర్పంచ్ సత్తమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆడాల గణేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, మాజీ సర్పంచ్ బోడ కృష్ణ, వార్డు సభ్యులు సురేందర్రెడ్డి, సుజాత, బీఆర్ఎస్ నాయకులు కిష న్, రమేశ్, కృష్ణ, అమీర్, ప్రవీణ్గౌడ్, మహేశ్, అంజయ్య, అనిల్, సాయిరెడ్డి, సుధాకర్, శివ పాల్గొన్నారు.
కల్వకుర్తిలో బీఆర్ఎస్దే విజయం
తలకొండపల్లి : అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ గుప్తా కోరారు. మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం గడపగడపకు బీఆర్ఎస్ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, మాజీ జడ్పీటీసీ పద్మ, సర్పంచ్లు గోపాల్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.