ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు అన్నదాతలు పొలాల్లో పూజలు చేసి పంటలు బాగా పండాలని వేడుకుంటారు. ఈ సందర్భంగా అన్నదాతలు పశువులు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పల్లెల్లో ఎడ్ల బండ్లతో నిర్వహించిన ఊరేగింపు చూపరులను ఆకట్టుకున్నది.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
బొంరాస్పేట, జూన్ 4 : ఏరువాక పౌర్ణమి పండుగను ఆదివా రం బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు పశువులను, ట్రాక్టర్లను శుభ్రంగా కడిగి వాటిని అందంగా అలంకరించి పూజలు చేశారు. పశువు లకు పోలెలు తినిపించారు. సాయంత్రం పశువులను, ట్రాక్టర్ల ను గ్రామాల్లో ఊరేగించి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఏరువాక ఉత్సవాలకు కొంత అంతరాయం కలిగింది.
కులకచర్ల: కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులు పశువులను వివిధ రకాలుగా అలంకరించి వాటికి తినుబండారాలను పెట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో హనుమాన్ దేవాలయాల చుట్ట్టూ ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు నిర్వహించారు.
కోట్పల్లి: మండలంలోని లింగంపల్లి, కోట్పల్లి, బుగ్గాపూర్, బార్వాద్ తదితర గ్రామాల్లోని రైతులు ఎద్దులను అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లడం అందరిని ఆనందాలకు గురి చేసింది. వ్యవసాయ పనులను ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమతమ పొలాల్లో భూమి పూజను చేస్తారు.
దౌల్తాబాద్: మండల కేంద్రంతో పాటు గోకఫస్లవాద్, తిమ్మా రెడ్డిపల్లి, చెల్లాపూర్, యాంకి, ఇముడాపూర్, మాటూర్, నీటూ ర్, చంద్రకల్, బిచ్చల్, అంతారం, సుల్తాన్పూర్, పొల్కం పల్లి,నాగసార్, అల్లపూర్, దేశాయిపల్లి, కౌడీడ్,నర్సపూర్, కుప్ప గిరి, సంగాయిపల్లి, దేవర్ఫస్లవాద్, బాలంపేట, గుండేపల్లి, నందారం, నర్సపూర్, కౌడీడ్, సురైపల్లి, నాగసారం, గుము డాల, దేశా యిపల్లి తదితర గ్రామాల్లో రైతులు పశువులను అలంకరించి ఆయా గ్రామాల్లో ఊరేగించారు.
బంట్వారం: ఆదివారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపు కున్నారు. మండల కేంద్రంతో పాటు, బొపునారం, తొరుమా మిడి, రొంపల్లి, సల్బత్తాపూర్, మద్వపూర్, మాలసోమారం, యాచారం, సుల్తాన్పూర్ తదితర గ్రామాల్లో ప్రజలు పండగను జరుపుకున్నారు. గ్రామాల్లోని రైతులు ఉదయమే తమ పాడి పశువులకు, ఎడ్లకు స్నానాలు చేయించి, రంగు రంగులతో అలంకరించారు. ఇండ్లలో వండుకున్న పిండి వంటలకు పశువులకు తినిపించారు. అనంతరం సాయంత్ర వేళలో ఎడ్ల బండ్లలో చిన్నా, పెద్దలు కూర్చోని గ్రామాల్లో ఊరేగించారు.