కొడంగల్, ఆగస్టు 12 : సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులతోపాటు బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్బాబు, బొంరాస్పేట పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్, ఏఎంసీ వైస్ చైర్మన్ భీములు, సర్పంచ్ సయ్యద్ అంజద్ మాట్లాడుతూ.. రాదనుకున్న తెలంగాణను ప్రాణాలకు అడ్డుపెట్టి సాధించడం, 3 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ కాళేశ్వరం ప్రాజక్టును పూర్తి చేయడం, మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం, మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధమైన శ్రీశైలం జలాలు, 24 గంటల నిరంతర విధ్యుత్ సరఫరా, పల్లె, పట్టణ కార్యక్రమాలతో పట్టణ, గ్రామాల అభివృద్ధి, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్ వంటి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ సీఎం కేసీఆర్ చరిత్రను సృష్టించినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి కానివ్వొదని ప్రతిపక్షపార్టీలు కేసులు పెట్టి అడ్డుకున్నాయన్నారు. వీటన్నింటినీ అధిగమించి బలమైన సంకల్పంతో ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు సాధించినట్లు తెలిపారు. అన్ని వర్గాల వారికి అనువుగా.. ఎవరూ ఊహించని విధంగా అద్భుత పథకాలను అందించి తెలంగాణకు బంగారు బాటలు వేసినట్లు వారు పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో నియోజకర్గానికి లక్షా49వేల ఎకరాలకు సాగునీరు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కొడంగల్ నియోజకవర్గానికి లక్షా49వేల ఎకరాలకు సాగునీరందడంవల్ల నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని వారు పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గ రైతులు వర్షాధారంతోనే పంటలు పండించుకునే ఆస్కారం ఉందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ప్రతి చెరువు, కుంటలు నీటితో నిండుకొని సంవత్సరంలో మూడు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. కేసీఆర్ పాలనను చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ప్రజలను మోసం చేసేందుకు అపోహలు, పుకార్లు పుట్టిస్తున్నారని, అటువంటి ఆవకాశవాదుల చెరలో పడకుండా ప్రజలు నిజానిజాలను గ్రహించాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, సర్పంచ్లు శంకర్నాయక్, గోవింద్, బీఆర్ఎస్ నాయకులు సాయిలు, ఫయూమ్, దత్తురెడ్డి, నవాజొద్దీన్, చిన్న ఫకీరప్ప, శంకర్బాబు, విజయ్కుమార్ ఉన్నారు.