ఇబ్రహీంపట్నం/వికారాబాద్, డిసెంబర్ 20 : రానున్న పార్లమెంట్ ఎన్నికల కు సర్వం సిద్ధం చేయాలని, ఓటరు జాబితా తయారీతో పాటు ఎన్నికలు ప కడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ని కల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆయా నియోజకవర్గా రిటర్నింగ్ అధికారులతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి గీతారెడ్డి, వికారా బాద్ అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యానాయక్, ఆర్డీవోలు విజయ కుమారి, శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ… మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికలపే పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ఓటర్ల జాబితా నిర్దే శించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.
జా బితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. 18 ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓట రుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఇందు కోసం అ వగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మార్పులు చేర్పులు చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో అన్ని మండలా ల్లో త హసీల్దార్లు, సంబంధిత ఎల క్షన్ సెక్షన్ సూ పరింటెండెంట్ ఇతర అధికారులు పాల్గొన్నారు.