పరిగి, నవంబర్ 11 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 13వ తేదీన కులకచర్లకు రానున్నారు. పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్రెడ్డికి మద్దతుగా మధ్యాహ్నం 2 గంటలకు జరిగే రోడ్షోలో ఆయన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి పాల్గొననున్నారు.
అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి రోడ్షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కోరారు.