రామంతాపూర్, ఏప్రిల్ 24 : వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం వలస కార్మికులు ఎమ్మెల్యేను కలిసి మేడే జెండా కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్వబాబు యాదవ్, గడ్డం రవికుమార్,సూరంశంకర్,సంఘం సభ్యులు బురాడ నరేశ్, నాగరాజు, మోహన్రావు, పోలినాయుడు, కాంతారావు, చిన్నారావు, రాంబాబు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.