కొత్తూరు, మార్చి 4: ప్రజాప్రతినిధుల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్ బాడీ సమావేశంలో ప్రజాప్రతినిధుల హాజరు తక్కువగా ఉందన్నారు. గ్రామాల్లో సమస్యలు లేనందు వల్లే ప్రజాప్రతినిధులు సమావేశాలకు రావడం లేదా? అన్న అనుమానాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. విద్యుత్, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ మొదలైన వాటిలో ప్రజాప్రతినిధులు సమస్యలను ప్రస్తావించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి మండలానికి 9.67 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శోభ, ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ రాములు, ఎంపీవో నర్సింహులు, ఎంపీటీసీ జె కృష్ణయ్య, సర్పంచ్లు రవినాయక్, అంబటి ప్రభాకర్, అరుణ, కో ఆప్షన్ మెంబర్ విజయపాల్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆలయ పనులు పూర్తి చేయాలి
నందిగామ : నందిగామ మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, నాయకులు నారాయణరెడ్డి, లక్ష్మయ్యయాదవ్, రాంరెడ్డి, సుదర్శన్గౌడ్, కుమారస్వామి, మురళి ఉన్నారు.