వికారాబాద్, అక్టోబర్ 12 : దశాబ్దాల పాటు కుల వృత్తి దారులు వెనుకబడిపోతున్నారు. ఉమ్మడి పాలనలో వారిని గుర్తించి ప్రోత్సహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎంతో మంది కులవృత్తులను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయీబ్రాహ్మణులు, రజకుల కులవృత్తులను ప్రోత్సహించింది. లాండ్రీ షాపులు, హెయి ర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడంతో వారికి ఎంతో ఆసరాగా నిలిచింది.
వికారాబాద్ జిల్లాలో 1,601 లాండ్రీ షాపులు, 1,064 హెయిర్ సెలూన్లు ఉన్నాయి. వీటిపై వారి కుటుంబాలు ఆ ధారపడి జీవిస్తున్నాయి. గతేడాది నుంచి బీఆర్ఎస్ ప్రభు త్వం 250 యూనిట్ల కరెంట్ను వారికి ఉచితంగా అందజేస్తున్నది. వారు విద్యుత్ బిల్లులతో కష్టాలు తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుల వృత్తుల వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం చేసి వారిని ఆర్థికంగా ఆదుకున్నది. ప్రస్తుతం వారికి రాజకీయాల్లో కూడా సముచిత స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయి.
చాలా ఏండ్లుగా కటింగ్ షాపుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. కుల వృత్తిదారులకు గత ప్రభుత్వాలు ఎ లాంటి సాయం చేయలేదు. నెలకు దా దాపు రూ.1000 నుంచి రూ.1200 వరకు విద్యుత్ బిల్లులు వచ్చేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– నర్సింహులు, కటింగ్ షాపు, వికారాబాద్
ప్రభుత్వం నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయ డం గొప్ప విషయం. గతంలో విద్యుత్ బిల్లులు దాదాపుగా రూ.2వేల వరకు వచ్చేవి. ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లిం చలేక ఇబ్బందులకు గురయ్యాం. షాపు అద్దె కూడా పెరగడంతో కుటుంబ అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం మాలాంటి వారికి ఎంతో ఆసరాగా నిలిచింది.
– సతీశ్, కటింగ్షాపు యజమాని, వికారాబాద్
తాతల కాలం నుంచి వస్తున్న కుల వృత్తిని రజకులమైన మేం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం. ప్రభుత్వ సా యం కోసం ఎదురు చూశాం. ఇటీవ ల 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చే యడం ఆనందంగా ఉంది. మాలాంటి వారికి ఈ అవకాశం ఎంతో ఉపయోగం. అద్దె భవనంలోనే షాపును కొనసాగిస్తున్నాం.
– నర్సింహులు, ఐరన్ షాపు, శివరాంనగర్ కాలనీ, వికారాబాద్
కుల వృత్తిని నమ్ముకుని ఐరన్ చేస్తున్నా. మాకు సరైన సమాయానికి బొగ్గులు సైతం లభించకపోవడంతో వృత్తిని నిలిపి వేయాల్సి వస్తున్నది. ప్రస్తుతం అందరూ గ్యాస్ స్టవ్పై వంటలు చేయడంతో బొగ్గులు దొరకక ఇబ్బంది పడుతున్నాం. అధిక ధరలకు కొనుగోలు చేసి వృత్తిని కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నాం. సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంతో కుల వృత్తిని గర్వంగా కాపాడుకుంటున్నాం.
– లక్ష్మణ్, గరీబ్నగర్, వికారాబాద్
కులవృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మాలాంటి వారి కోసం సీఎం కేసీఆర్ 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం చాలా సంతోషం. ఎన్నో ఏండ్ల్లుగా కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. పెరిగిన అద్దెలు, కరెంట్ బిల్లులతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కరెంట్ బిల్లులు చూస్తేనే భయపడాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ హయాంలో కుల వృత్తుల వారికి ఆర్థిక చేయూతను ఇవ్వడం అనందంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎం.రమేశ్, జిల్లా అధ్యక్షుడు, నాయీ బ్రాహ్మణ సంఘం, వికారాబాద్