వికారాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కంటివెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమంలో 3.48 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా, రెండో విడుతలో జిల్లాలోని 10 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 380 మం దికి, మున్సిపాలిటీల్లో 400 మందికి కంటి పరీక్ష లు నిర్వహించేలా జిల్లాలో 42 బృందాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఆ బృందాల్లో మెడికల్ అధికారితోపాటు కంటి వైద్యులు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశ వర్కర్లు ఉంటారన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రజాప్రతినిధు లు, అధికారులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి సూ చించారు. అదేవిధంగా జిల్లాకు మంజూరైన టిఫా యంత్రాన్ని తాండూరు జిల్లా దవాఖానలో ఏర్పా టు చేశామని, గర్భిణులు ‘టిఫా’ సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు త్వరలోనే న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా ‘మన ఊరు-మన బడి’లో భాగం గా పనులు పూర్తైన స్కూళ్లను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై ఆర్అండ్బీ అధికారులపై మంత్రి అసంతృ ప్తి వ్యక్తం చేశారు. నాలుగేండ్లు అయినా వంద మీ టర్ల రోడ్డు పెండింగ్ పనులను పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు. సత్వరమే ఆ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం పౌరసరఫరాల శాఖకు సంబంధించి చర్చ జరుగగా.. ఉమ్మ డి రంగారెడ్డి జిల్లాలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి నాబార్డ్, డీసీసీబీ ద్వారా రూ.100 కోట్లు మంజూరైనట్లు డీసీసీబీ చైర్మెన్ బుయ్యని మనోహర్రెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి పలువురికి బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, కాలె యాదయ్య, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీసీసీబీ చైర్మన్ బు య్యని మనోహర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాభివృద్ధిలో జడ్పీది కీలక పాత్ర
జిల్లాభివృద్ధిలో జిల్లా పరిషత్ కీలక భూమిక పోషిస్తున్నదని.. జడ్పీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పొలాలకు దారులు, డ్వాక్రా, అంగన్వాడీ భవనాలను నిర్మించినట్లు జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా నిధులు వస్తున్నాయని, జిల్లా పరిషత్ నుంచి కూడా రూ.కోట్ల నిధులను మంజూరు చేశామని.. పనులను నాణ్యతగా చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. జడ్పీ నిధుల్లో అత్యధికంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జడ్పీ చైర్పర్సన్ సూచించారు. అదేవిధంగా ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో జిల్లా ముందుండాలని, అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు.
గ్రామాలు, పట్టణా ల్లో ప్రారంభమైన పల్లె, బస్తీ దవాఖానల్లో వైద్యు లు అందుబాటులో ఉండాలని.. ప్రజలకు మెరుగైన వైద్యమందించాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు బాగా కష్టపడి చదివి ప్రభు త్వ ఉద్యోగాలను సాధించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని.. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై పోలీసులు నిఘా పెట్టి అరికట్టాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని.. వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు.భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇం కుడు గుంతలను నిర్మించుకోవాలన్నారు.