బషీరాబాద్, డిసెంబర్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నర్సరీల్లో నాణ్యమైన విత్తనాలు వాడాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా అన్ని చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో పీడీ కృష్ణన్, డీపీవో తరుణ్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ టీఏలు, ఎఫ్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించార
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంనాటికి మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలకు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. నల్ల మట్టి, ఎర్ర మట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపి ప్యాకెట్లలో నింపి విత్తనాలను విత్తాలని తెలిపారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటి గ్రామాలను పచ్చదనంతో నింపాలని, క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు.
గ్రామాలను పరిశభ్రంగా ఉంచేందుకు పంచాయతీ కార్యదర్శులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని డీపీవో కార్యదర్శులను ఆదేశించారు. మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయాలన్నారు. పైపులైన్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించాలని తెలిపారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. అంతకు ముందు నవాంద్గీ గ్రామంలో చెత్త నుంచి తయారు చేస్తున్న వర్మి కంపోస్టు తయారీ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, డీఎల్పీవో శంకర్, ఎంపీడీవో, రమేశ్, ఏపీవో శారద పాల్గొన్నారు.