సుల్తాన్బజార్, డిసెంబర్ 3: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నదని తెలంగాణ వైద్య,విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి అన్నారు.
శనివారం కోఠిలోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆర్ఎంవో డాక్టర్ ప్రభాకర్లతో కలిసి పలు వార్డులను సందర్శించారు. అనంతరం దవాఖాన ఆడిటోరియంలో నూతన పీజీ విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.