దౌల్తాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ పండుగ చేశారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ పొలంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే కేసీఆర్, రైతుబంధు సంబురాలు, 50వేల కోట్లు, దౌల్తాబాద్ మండలం అనే ఆకారంలో వరి నాట్లు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు పథకం అన్నదాతల జీవితాల్లో వెలుగు నింపిందని, వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కలిగించి సాగుపై భరోసా కల్పించిందని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయకుమార్, జడ్పీటీసీ మైపాల్, మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు భగవంతు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, నాయకులు నరోత్తంరెడ్డి, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.