వికారాబాద్, జూన్ 14 : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఆసు పత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యు లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదల వల్ల ఎంతో మంది ప్రాణా పాయ స్థితిలో ఉంటారన్నారు.
ప్రాణాలను నిలబెట్టేందుకు రక్తం ఎంతో ముఖ్యమన్నా రు. ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నార న్నారు. ఆరోగ్యంగా ఉన్నవారి నుంచి రక్తాన్ని సేకరించి ఆపదలో ఉన్న వారికి అంద జేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో తుకారం, వైద్యు లు శాంతప్ప, శ్రీజ, వైద్య సిబ్బంది ప్రభాకర్ ఉన్నారు.