శంకర్పల్లి, నవంబర్ 23 : ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు సి బ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం బాలింతకు కేసీఆర్ కిట్ను అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్, డా.రేవతిరెడ్డి, బాబురెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.