శంకర్పల్లి జనవరి12: అభయహస్తం దరఖాస్తుల్లోని డేటాను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని రంగారెడ్డి జిల్లా మెప్మా పీడీ శంకర్సింగ్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న వివరాల ఆన్లైన్ నమోదును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని దరఖాస్తులు చేసుకున్నారని, ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్జానేశ్వర్, సిబ్బంది అనూష, తదితరులు పాల్గొన్నారు.