వికారాబాద్, మే 29 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 8, 9, 10 తేదీల్లో జిల్లా కేంద్రంలో చేప ఉత్పత్తుల ఆహార మేళా(ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరిత తెలిపారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రోజులపాటు జరుగనున్న ఈ మేళాలో పది స్టాళ్లను ఏర్పాటు చేసి వివిధ రకాల చేపలు, రొయ్యల ప్రత్యేక వంటకాలను తయారు చేసి విక్రయించాలని సూచించారు.
వంటల్లో అనుభవం ఉన్న, ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా రు. స్టాళ్లను ఏర్పాటు చేయాలనుకునే వారు ముందస్తుగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఎన్ఐటీహెచ్ఎంలో శిక్షణ పొంది న మహిళలు, మహిళా మత్స్యకారులు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల వారు అర్హులన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్ని గ్రామాల్లో మత్స్య సహకార సంఘంలోని సభ్యులు జూన్ 8న వలలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు వెళ్లి చెరువుల పండగను ఘనంగా నిర్వహించాలన్నారు.