పరిగి, డిసెంబర్ 2 : కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ విధులు నిర్వహించే కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కౌంటింగ్ ప్రక్రియలో సూపర్వైజర్ల పాత్ర చాలా కీలకమని, పారదర్శకంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని చెప్పారు. ప్రతిఒక్కరూ ఉదయం 5 గంటల వరకే గుర్తింపుకార్డులతో సహా కౌంటింగ్ హాల్లో ఉండాలన్నారు. కలెక్టర్తోపాటు కౌంటింగ్ పరిశీలకులు స్నేహ హిందూరావుపాటిల్, సాధన, పరిశీలకులు పి.ఆకాష్, రిటర్నింగ్ అధికారులు రాహుల్శర్మ, లింగ్యానాయక్, శ్రీనివాసరావు, విజయకుమారి, జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి, డీఎస్హెచ్వో చక్రపాణి, డీవైఎస్వో హనుమంతరావు, డీటీడీవో కోటాజీ, పరిశ్రమల శాఖ అధికారి వినయ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ ఉన్నారు.