రంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలను సాధిస్తున్నది. వారి జీవితాల్లో ఆర్థిక పరిపుష్టిని నింపుతూ నిర్విఘ్నంగా ముందుకు సాగుతున్నది. ఈ పథకంతో అనతికాలంలోనే గొర్రెల సం పద అమాంతం పెరిగి గొల్ల, కురుమల ను సీమంతులను చేసింది. జిల్లాలో మొ దటి విడుతలో రూ.1.32 కోట్లను వెచ్చించి 11,685 యూనిట్లను ప్రభు త్వం గొల్ల,కురుమలకు పంపిణీ చేసింది. ఈ ఏడా ది జూన్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చు ట్టింది. ఇందుకు రూ.300కోట్లను వెచ్చిస్తున్నది. ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సక్సెస్ కాగా ఏ గ్రామంలో చూసినా సర్కారు పంపిణీ చేసిన గొర్రెల మందలే కనిపిస్తున్నాయి.
ప్రారంభమైన రెండో విడుత పంపిణీ
దేశంలో ఎక్కడాలేని విధంగా గొల్ల, కురుమల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఇందుకోసం సబ్సిడీపై గొ ర్రెలను పంపిణీ చేస్తున్నది. తొలి విడుతలో సబ్సిడీపై రూ. 1.25 లక్షల విలువై న 21 గొర్రెలను రూ. 31, 750 అందించిన ప్రభుత్వం ఆ తర్వాత యూనిట్ విలువను రూ.1.75 లక్షలకు పెంచి లబ్ధ్దిదారుడి వాటాగా రూ.43,450 అందిస్తున్నది. జిల్లాలో 2017 జూన్లో మొదటి విడుతలో 11,685 మంది గొల్ల,కురుమలకు 2,45,385 గొర్రెలను పంపిణీ చేసింది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని జూన్ 9న జిల్లాలో ఆరంభించారు. 30,009 యూనిట్ల కింద 6,30, 189 గొర్రెలను అందించాలని ప్ర భు త్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇందుకు రూ.300 కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో రూ.కోటి విలువైన 746 యూనిట్లను లబ్ధిదారులకు అందజేసింది. రాష్ర్టానికి ఎన్సీడీపీ రుణం ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డడంతో తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా నిధులు సమకూర్చుకుని రెండో విడుత పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది.
దశ మార్చిన గొర్రెల పంపిణీ..
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఉపాధి లేక గొల్ల, కురుమలు ఇతర రాష్ర్టాలకు వలస పోయేవారు. కులవృత్తిని నమ్ముకుని గొర్రెలను పెంచుకుందామంటే జీవాలకు తాగేందుకు నీళ్లు, తినేందుకు మేత దొరకని పరిస్థితి అప్పట్లో ఉండేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో నీటి గోస తీరింది. ఎక్కడ చూసినా పచ్చని పంటలే కనిపిస్తున్నాయి. జీవాలకు మేత, నీటి ఇక్కట్లు తీరాయి. దీనికి తోడు గొల్ల,కురుమలకు ఉపాధి కల్పించేందుకు అమలుచేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం వారి దశను మార్చింది. ప్రభుత్వం 20గొర్రెలు, ఒక్క పొట్టేలను అందజేయగా ఆ సంఖ్య నేడు మూడింతలకు పెరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను తమ వద్దే ఉంచుకుని వాటికి పుట్టిన పిల్లలను మాత్రమే యజమానులు అమ్ముకుంటున్నారు. వాటిలోనూ మగ గొర్రెలనే అమ్మి, ఆడ గొర్రెలను మందలోనే ఉంచడంతో పునరుత్పత్తి పెరిగి పల్లెల్లో ఎక్కడ చూసినా భారీ మందలు కనబడుతున్నాయి.
స్థానికంగానే విక్రయాలు..
ఒకప్పుడు వివిధ శుభకార్యాలకోసం గొర్రెలు, మేకలు కావాలంటే పక్క జిల్లాలోని సంతలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం గొర్రెల కొరతను తీర్చింది. ఆరేండ్లలో గొర్రెల సంపద గణనీయంగా పెరుగడం తో ఎక్కడ చూసినా సర్కారు పంపిణీ చేసిన గొర్రెల మందలే కనిపిస్తున్నాయి. ఫలితంగా గొర్రెలు, మేకల కొనుగోలు కోసం గతంలో పడ్డ ఇబ్బందులు తీరా యి. స్థానికంగా పశువుల సంతలను నిర్వహిస్తుండడంతో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు ఇక్కడికే వచ్చి కొనుక్కెళ్తున్నారు. కొంతమంది మందల వద్దకే వెళ్లి బేరం చేస్తున్నారు. మధ్యవర్తిత్వం లేకుండా గొల్ల కురుమలే నేరుగా విక్రయించి ఉపాధి పొందుతున్నారు. సమృద్ధిగా మాం సం లభిస్తుండడంతో వినియోగదారులకు నాణ్యమైన మాంసం సైతం అందుబాటులోకి వచ్చింది.
వికారాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, దళితబంధు లాంటి పథకాలను అమలు చేస్తుండడంతో ఆయా వర్గాల ప్రజల జీవితాలు పూ ర్తిగా మారిపోతున్నాయి. సబ్సిడీ గొర్రెల పంపిణీతో గొల్ల, కురుమలు ప్రతిఏటా రూ.2 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తూ.. ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.
ఐదేండ్లలో సబ్సిడీ గొర్రెలు, వాటి సంతానంతో ఇప్పటివరకు ఆరు ఈతలురాగా, సబ్సిడీ గొర్రెలతో ఏడాదికి ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు సంపాదించాడు. అయితే ఈ ఐదేండ్లలో రూ. 385 కోట్లకుపైగా గొల్ల, కురుమలకు ఆదాయం వచ్చింది. జిల్లాలో మొదటి విడుతలో 11,333 మంది లబ్ధ్దిదారులకు రూ.125 కోట్ల విలువ చేసే 2.76 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా, రెండో విడుతలో 11,787 మంది లబ్ధిదారులు అర్హులుకాగా ఇప్పటివరకు 8,365 మంది డీడీలు చెల్లించారు. ఇప్పటివరకు 526 మందికి సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయగా ఈనెలాఖరులోగా 1,449 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు.
ఆర్థికంగా నిలదొక్కుకున్నాం..
సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నారు. గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తూ ఆదుకోవడం హర్షణీయం. తా తల కాలం నుంచే మా కుటుంబం గొర్రెలను మోపు తూ జీవిస్తున్నది. మూడేండ్ల క్రితం ప్రభుత్వం మా కుటుంబంలోని ముగ్గురికి కలిసి సబ్సిడీపై 63 గొర్రె పిల్లలను పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ గొర్రె పిల్ల లు 90 వరకు చేరాయి. ప్రస్తుతం ఒక్కో గొర్రెను విక్రయిస్తే రూ. 10 వేల వరకు ఆదాయం వస్తున్నది. ప్రభుత్వం నుంచి పొందిన గొర్రెల ను మోపుతూ ఆర్థికంగా ఎదిగి ఒకరిపై ఆధారపడకుండా ఆత్మాభిమా నంతో జీవిస్తున్నాం.
ఫకీరప్ప, గొర్రెల కాపరి, టేకల్కోడ్ , కొడంగల్
గొర్రెల పంపిణీతో ఆర్థిక ప్రగతి
సీఎం కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలతో ఎంతో మేలు జరుగుతున్నది. తాతల కాలం నుంచి మా కుటుంబం గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నది. ఐదేండ్ల క్రితం ప్రభుత్వం మా కు ఒక యూనిట్గా 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలును అందజేసింది. గొర్రెలను చక్కగా పెంచడంతో ప్రస్తుతం మా దగ్గర 250 వరకు గొర్రెలున్నాయి. ఒక్కొక్క గొర్రె కనీసం రూ.10 వేల వరకు విలువ చేస్తున్నది. ఈ లెక్కన కనీసం రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లే. మాకు గొర్రెలు పంపిణీ చేసి ఆదాయం వచ్చేలా చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-రమేశ్, ఐనాపూర్, దోమ/పరిగి
మా బతుకులకు తోవ చూపిండు..
మా తాతల నుంచి జీవాలను నమ్ముకునే బతుకుతున్నాం. గతంలో కులవృత్తిని నమ్ముకుని గొర్రెలను పెంచుదామంటే జీవాలకు తాగేందుకు నీళ్లు, తినడానికి మేతలేక.. సాకలేక బతుకుడెట్లా అని చింత చేసినం. కానీ.. సీఎం కేసీఆర్ దేవుడొలే ఆదుకున్నారు. తొలుత నా కొడుకుకు గొర్రెలు ఇచ్చిండు. ఈ మధ్యనే నాకు కూడా గొర్రెలొచ్చాయి. ఇద్దరివి కలిపితే పెద్ద గొర్రె ల మందనే అయ్యింది. గిప్పుడు జీవాలకు నీటి గోసలేదు. మేతకు ఇబ్బందులూ లేవు. పొట్టచేతబట్టుకుని వలస పోవుడు కూడా బంద్ అయ్యింది. మంచిగా బతుకుతున్నాం. గొల్ల కురుమలం సీఎం కేసీఆర్ సాయాన్ని మర్చిపోలేం. -బీర్ల చెన్నయ్య, కేశగూడ, షాబాద్ మండలం
అన్ని వర్గాలకు సమన్యాయం..
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు యాదవ సోదరుల ను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. సందర్భంగా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మొదటి విడుతలో పంపిణీ చేసిన గొర్రెలు పెరిగి డబుల్ అయ్యాయి.
– ఎస్.సత్యనారాయణ, గొర్రెల కాపరుల సంఘం
రేఘడిగణాపూర్ గ్రామ ఉపాధ్యక్షుడు, చేవెళ్ల మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
గొల్ల,కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే గొల్ల,కురుమల బతుకు లు మారుతున్నాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉం టాం. గత ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలను నిర్ల క్ష్యం చేశాయి. కుల వృత్తులకు ప్రభుత్వం ప్రాధాన్యమి స్తున్నది. -దండు సత్యం, చేవెళ్లటౌన్
గొర్రెలు, మేకల ఉత్పత్తి పెరిగింది
గొల్ల, కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. సబ్సిడీ గొర్రెల పంపిణీతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. తద్వారా గొర్రెలు, మేకల ఉత్పత్తి కూడా పెరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొల్ల,కురుమల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– భాష, మేడిపల్లి, యాచారం మండలం
ఆర్థికంగా ఎదుగుతున్నారు..
గొర్రెలను పంపిణీ చేసి గొల్ల,కురుమలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. గొర్రెల పంపిణీతో స్వయం ఉపాధి పొంది గొల్ల,కురుమలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. గొర్రెల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నది.
-కాలె మల్లేశ్, తమ్మలోనిగూడ యాచారం మండలం
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
గత ఉమ్మడి ప్రభుత్వాలు గొల్ల,కురుమలను ఆదుకోలేదు. ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే మాకు గొర్రెలను పంపి ణీ చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత అందిస్తున్నారు. మాకు మంచి చేస్తున్న కేసీఆర్సార్కే అండగా ఉంటాం. కేంద్రం నిధులు ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారు.
-కలికెల మల్లయ్యయాదవ్, తలకొండపల్లి
గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ గొల్ల,కురుమల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తొలి విడుతలో వచ్చిన గొర్రెలతో నా జీవనోపాధి మెరుగైనది. గ్రామాల్లో ఉపాధి లేక ఖా ళీగా ఉన్న గొల్ల,కురుమల కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా నిలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం నా కుటుంబానికి అందుతున్నది.
-బడ్క సత్తయ్య, న్యామతాపూర్, కడ్తాల్ మండలం
లాభాలు పొందుతున్నాం..
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉచితంగా గొర్రెలను ఇవ్వలేదు. గొల్ల,కురుమలకు బతుకుదెరువును చూపలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గొల్లకురుమల ఆర్థిక వృద్ధి కోసం సబ్సిడీపై గొర్రెలను పం పిణీ చేస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్ లో గొర్రె మాంసానికి మస్తూ డిమాండ్ ఉన్నది. మాం సాన్ని విక్రయించి మంచి లాభాలను పొందుతున్నాం. దీంతో మేము ఆర్థికంగా ఎదుగుతున్నాం.
– మామిడిపల్లి మహేందర్, లబ్ధిదారు, కొత్తూరు
సీఎం మా పాలిట దేవుడు
సీఎం కేసీఆర్ గొల్ల,కురుమల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసి ఆర్థికంగా ఎదిగేలా చేయూత అందిస్తున్నారు. అంతేకాకుం డా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి అండగా నిలుస్తున్న సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మా పాలిట దేవు డు. అలాంటి నాయకుడు ఉంటేనే ప్రజల సమస్యలు తీరు తాయి.
-కడారి మల్లయ్య, ఇర్విన్ గ్రామం, మాడ్గుల
సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు
సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నది. ఇప్పటికే గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను పం పిణీ చేస్తూ ఆర్థికంగా ఎదిగేలా చూస్తున్నారు. వివిధ సం క్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారు. ఇలాంటి సీఎం ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించి.. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.
-అంజయ్యయాదవ్, మిర్జాగూడ, శంకర్పల్లి
సీఎం కేసీఆర్ ఆలోచన బాగుంది
తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాల వారికి లాభం జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఆలోచన చాలా బాగు న్నది. ఉద్యోగాలు లేని వారికి, ఇండ్ల వద్ద ఉండే వారికి స్వయం ఉపాధిని కల్పిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు గొర్రెలను నమ్ముకుని బతుకుతున్నాయి. వారికి సీఎం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారు. నాకు కూడా మొదటి విడుతలోనే గొర్రెలు వచ్చాయి.
– చంద్రయ్య, గొర్రెల కాపరి, తీగాపూర్, కొత్తూరు