యాచారం, నవంబర్ 23 : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 51మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో మైనింగ్జోన్ ఏర్పాటు చేయకుండా ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. 26న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, రైతులు మైనింగ్ అనుమతులపై తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేయాలన్నారు. నియోజకవర్గంలో మైనింగ్ జోన్ కోసం 680 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ఆయన తెలిపారు.
నియోజకవర్గంలో ఆరేండ్లలో రూ.90 కోట్ల పైచిలుకు చెక్కులను అందజేసినట్లు తెలిపారు. చెక్కులను గతంలో కాకుండా ప్రస్తుతం ఎప్పటికప్పుడూ రావడం సంతోషకరమన్నారు. అనంతరం బాండెడ్ లేబర్ సమస్యలను పరిష్కరించాలని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్, సర్పంచ్లు ఉదయశ్రీ, శ్రీనివాస్రెడ్డి, కృష్ణ, సంతో ష, ఎంపీటీసీలు శివలీల, శారద, సింగిల్ విండో డైరెక్టర్ స్వరూప, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భాష, నాయకులు బిలకంటి శేఖర్రెడ్డి, మల్లేశ్, రాజు పాల్గొన్నారు.
యాక్షన్ ప్లాన్ తయారు చేయండి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న విద్యుత్ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి వెంటనే యాక్షన్ప్లాన్ తయారు చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సంబంధిత విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ డీఈ, ఏడీఏలు, ఏఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు నేలను తగిలేటట్లుగా వేలాడుతున్నాయని, వాటిని వెంటనే సరి చేయాలని సూచించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం డీఈ యాదగిరి, తుర్కయాంజాల్ ఏడీఈ వినోద్రెడ్డి, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.