కడ్తాల్, డిసెంబర్ 31 : నిత్యం ధ్యానం చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని, ధ్యానమయ ప్రపంచ నిర్మాణంతోపాటు, ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాష్ పత్రీజీ సంకల్పమని పరిణిత పత్రీ, ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్రెడ్డి అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసపురి మ హేశ్వర మహా పిరమిడ్లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఉదయం ఐదు నుంచి ఎనిమిది గం టల వరకు నిర్వహించిన ప్రాతఃకాల ధ్యానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధ్యానులద్దేశించి పరిణిత పత్రీ మాట్లాడుతూ.. నిత్యం ధ్యాన సాధనతో మనసు ప్రశాంతంగా ఉండడంతోపాటు ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. సుభాష్ పత్రీజీ భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన మీద ఉన్న అభిమానంతో సభలకు లక్షలాదిగా తరలివచ్చిన ధ్యా ను టలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ధ్యానీ పత్రీజీ చూపిన ధ్యాన మార్గంలో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ధ్యానులు 18 ఆదర్శ సూత్రాలను పాటించి ముందుకు సా గాలని పిలుపునిచ్చారు. ఎలాంటి కష్ట సమయంలోనైనా ధ్యానం గుర్తుకొచ్చిన మరుక్షణం, మనం అ నుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.
2024 డిసెంబర్లో నిర్వహించనున్న సభలకు ‘పత్రీజీ మహిళా ధ్యాన మహాయాగం’గా నామకరణం చేసినట్లు వివరించారు. అనంతరం పిరమిడ్ ప్ర ధాన వేదికపై ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ప రిమళ పత్రీ, పరిణిత పత్రీ, ట్రస్టు సభ్యులను స న్మానించారు. అంతకుముందు ధ్యాన వేదికపై ప్ర ముఖ సింగర్ శ్రీలలిత ఆలపించిన పాటలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆ కట్టుకున్నాయి. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చై ర్మన్ విజయభాస్కర్రెడ్డి, సభ్యులు సాంబశివరా వు, హన్మంతురాజు, బాలకృష్ణ, లక్ష్మి, శ్రీరామ్గోపాల్, మాధవి, జయశ్రీ, సౌమ్యకృష్ణ, దామోదర్రెడ్డి, శివప్రసాద్, మాధవి, రాంబాబు, శివప్రసాద్, చంద్రశేఖర్, కేశవరాజు, భారతి, సునీ త, సురేశ్, రవికుమార్, పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నవకాంత్, ఆనంద్, ధ్యానులు పాల్గొన్నారు.