కార్తిక మాస నాల్గో సోమవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు, భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి తమ కోర్కెలను నెరవేర్చాలని స్వామివారిని వేడుకున్నారు. మహిళలు ఆలయాల ప్రాంగణాల్లో కార్తిక దీపాలను వెలిగించారు. దీంతో ఆలయ ప్రాంగణాలు శివనామ స్మరణతో మర్మోగాయి.
షాద్నగర్టౌన్, డిసెంబర్ 11: కార్తిక మాసాన్ని పురస్కరించు కుని పట్టణంలోని శివాలయాలు కార్తిక శోభను సంతరించుకున్నా యి. ఉదయం నుంచే లింగేశ్వరుడికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషే కాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. షాద్నగర్ పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలోని శ్రీ గిరిజామృతాలింగేశ్వరస్వా మికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలను వెలిగించారు.
కులకచర్ల, డిసెంబర్ 11 : కార్తిక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరామలింగేశ్వరాలయం భక్తులతో సందడిగా మారింది. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు, భక్తులు లక్షబిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామలింగేశ్వరుడికి లక్ష బిల్వపత్రాలతో అర్చన చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్, ఆలయ చైర్మన్ నర్సమ్మారాములు మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తిక మాస చివరి సోమవారం నాడు స్వామివారికి లక్షబిల్వార్చన నిర్వహిస్తామని తెలిపారు.
యాచారం, డిసెంబర్ 11: కార్తిక మాస నాల్గో సోమవారాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నందివనపర్తి గ్రామంలోని నందీశ్వరక్షేత్రంలో కొలువుదీరిన నంది, శివలింగం, అమ్మవారికి భక్తులు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా సిద్ధేశ్వరాలయంలోని స్వయం భూ శివలింగానికి కూడా భక్తులు అభిషేకం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఓంకారేశ్వరాలయం కూడా భక్తులతో సందడిగా మారింది. మల్కీజ్గూడలోని పాలేశ్వరాలయంలోని శివలింగానికి భక్తులు పూజలు నిర్వహించారు.
మహిళలు కార్తిక దీపాలను వెలిగించారు. కొత్తపల్లి గుట్టపైన కొలువుదీరిన గోదాదేవీపద్మావతి సమేత వేంకటేశ్వరాలయం భక్తులతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు మరకత శివలింగాకి అభిషేకాలు నిర్వహించారు. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
శంకర్పల్లి, డిసెంబర్ 11 : కార్తిక మాస చివరి సోమవారం సందర్భంగా మండలంలోని చందిప్ప గ్రామంలోని మరకత శివాలయంలో భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణం లో కార్తిక దీపాలను వెలిగించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య చైర్మన్ సదానందంగౌడ్, సర్పంచ్ స్వప్పామోహన్ పాల్గొన్నారు.