‘తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.. సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు.. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందుతున్నది’.. అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మీర్పేటలో మన బస్తీ-మన బడి పథకం కింద రూ. 56 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించగా, సరూర్నగర్ డివిజన్ విజయపురి కాలనీలో రూ.5.98 కోట్లతో ట్రంక్లైన్ నిర్మాణ పనులు, రూ.31లక్షలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేర్వేరుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రేటర్ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతున్నదని పేర్కొన్నారు.
బడంగ్పేట : సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేటలో రూ. 56 లక్షలతో మన బస్తీ – మన బడి పథకం కింద అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికీ రూ. 1.20 లక్షలు ఖర్చుపెట్టి ఉచితంగా వారికి విద్యతో పాటు, పౌష్టికాహారాన్ని అందిస్తూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారన్నారు. దివ్యాంగుల బాల బాలికలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రూ.2కోట్ల వ్యయంతో 8 వేల మందికి సహాయ పరికరాలను అందించామన్నారు. అద నపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్ర భుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని చక్క గా చదువుకొని తల్లిదండ్రులు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. అనంతరం దివ్యాంగ బాల బాలికలకు సహాయ పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆర్కేపురం : గ్రేటర్ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సరూర్నగర్ డివిజన్ విజయపురి కాలనీలో రూ.5.98 కోట్లతో నిర్మించనున్న ట్రంక్లైన్ నిర్మాణ పనులు, రూ.31లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని ఆర్కేపురం, కొత్తపేట డివిజన్ల పరిధిలో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న ట్రంక్లైన్ పనులకు మోహన్నగర్లో మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 ఏండ్ల కిందట ఎబ్బీనగర్ ప్రాంతం ఎటుండెనో, ఇప్పుడు ఎలా మారిందో చూస్తేనే నగర అభివృద్ధి తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శలు మురుకుంట్ల అరవింద్శర్మ, బేర బాలకిషన్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, మహేందర్యాదవ్, రుషి తదితరులు పాల్గొన్నారు.