షాబాద్, మే 17 : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్యమ నేత, పార్టీ చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్టు చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.