తుర్కయాంజాల్,నవంబర్ 3: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి 11వ వార్డులో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మంచిరెడ్డి కిషన్రెడ్డిదే అన్నారు.
మరోమారు బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాగన్నగూడలో మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కందాడి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు రాగన్నగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కందాడి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో తుర్కయాంజాల్ మాజీ సర్పంచ్ చెవుల దశరథ, బీఆర్ఎస్ నాయకులు ధన్రాజ్, విజయానంద్రెడ్డి, కొంతం యాదిరెడ్డి, ఆర్ల కృష్ణ, మేతరి అశోక్, నిరంజన్రెడ్డి, బాబయ్య, మర్రి మహేందర్రెడ్డి,బద్దం వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ అంజయ్య పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపుతో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండలంలోని దండుమైలారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎంపీపీ మాట్లాడుతూ…రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే మరోసారి పార్టీని గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, గ్రామ సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి, సహకార సంఘం చైర్మన్ బిట్ల వెంకట్రెడ్డి, నాయకులు జంగయ్య, మంగ వెంకటేశ్, ఐలయ్య పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, దండుమైలారం, నెర్రపల్లి, పోల్కంపల్లి, నాగన్పల్లి, కప్పాడు, తుర్కగూడ, ఎలిమినేడు, పోచారం, చర్లపటేల్గూడ, తులేకలాన్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో దండుమైలారం సర్పంచ్ మల్లీశ్వరి, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, సహకారసంఘం చైర్మన్ మహేందర్రెడ్డి, తుర్కగూడ ఎంపీటీసీ భరత్రెడ్డి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు జోరుగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. బూత్ల వారీగా ఇప్పటికే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఆ పార్టీ నాయకులు గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని వారు వివరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 24వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
మంచాల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడి కిషన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. దాత్పల్లి, చీదేడు, బోడకొండ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింగ్ అనిత, బీఆర్ఎస్ నాయకులు
యాచారం : మండలంలోని పలు గ్రామాలల్లో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. మేడిపల్లి, అయ్యవారిగూడ, నల్లవెల్లి, తక్కళ్లపల్లి, చింతపట్ల, గున్గల్, యాచారం, ధర్మన్నగూడ తదితర గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటేసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, నాయకులు జిల్లా రాములు, స్వరూప, ఓరుగంటి యాదయ్యగౌడ్, కిషన్, పాలకూర్ల లక్ష్మీపతిగౌడ్, తలారి మల్లేశ్, మండలి గోపాల్,
ఆదిబట్ల : కొంగరకలాన్, ఎంపీ పటేల్ గూడ, ఆదిబట్ల గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, డైరెక్టర్ పాశం రవీందర్గౌడ్, కౌన్సిలర్లు కోల నాగేశ్, వనం శ్రీను, గోపగల్ల మహేందర్, నాయకులు శ్రీకాంత్, నారాయణ, నర్సగళ్ల ప్రవీణ్, రాజేశ్గౌడ్ పాల్గొన్నారు.