మంచాల : దళితులు ఆర్థికంగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నాడని టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏర్పుల చంద్రయ్య అన్నారు. సోమవారం మంచాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు నల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక్కో లభ్ధిదారునికి రూ. 10లక్షలు అందించనున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలో మొదటి విడతగా వందమంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మంకు వినోద్, బాల్రాజ్, హరిప్రసాద్, గంట విజయ్ పాల్గొన్నారు.