శంకర్పల్లి, సెప్టెంబర్ 1 : దళితబంధు పథకం దేశానికి ఆదర్శమని, దళితులు ధనవంతులు అవుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండలంలోని అలాంఖాన్గూడ గ్రామంలో దళితబంధు ద్వారా ఏర్పాటు చేసిన డెయిరీ ఫామ్ను ఎమ్మెల్యే యాదయ్య రాజుకు అందజేశారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాల మాణెమ్మ గోపాల్కు దళితబంధు ద్వారా సెంట్రింగ్కు సంబంధించిన మెటీరియల్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అన్ని రాష్ర్టాలు తెలంగాణను అనుసరిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్ నరేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్కన్నా పాల్గొన్నారు.