తలకొండపల్లి : ఉరేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శివశంకర్వరప్రసాద్, స్థానికులు కథనం ప్రకారం.. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సాజియాబేగం (32) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నదన్నారు. మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నదని తెలిపారు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికే మృతి చెందినట్లు తెలిపారు. తల్లి జహిరాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించామని తెలిపారు.