కడ్తాల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన భాస్కర్(25) తన బైక్పై, స్వగ్రామం నుంచి హైదరాబాద్కి బయల్దేరాడు. రాత్రి పది గంటలకు కడ్తాల్ మండలం కర్కల్పహాడ్ గ్రామ సమీపంలోకి రాగానే, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారు సడెన్గా పెట్రోల్బంక్ లోపలికి మళ్లుతుండగా కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న భాస్కర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.