వికారాబాద్ : చికిత్స పొందుతూ యువ రైతు బుధవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 15మంది పూల రైతులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఈ నెల 8న బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన యువ రైతు బందెన్నోళ్ల హరిశ్వర్రెడ్డి (26) హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
శవాన్ని పీరంపల్లికి తీసుకొచ్చి గ్రామస్తులు అంత్యక్రియలు చేశారు. వ్యాన్ బోల్తా పడిన ప్రమాదంలో మరోకరు మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు.