వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ మహిళా మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26న వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఓ మహిళ(40) స్పృహ తప్పి పడిపోయింది. గుర్తించిన మున్సిపల్ సిబ్బంది ఆ మహిళలను వికారాబాద్ ఏరియా దవాఖానలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.