కడ్తాల్ : కడ్తాల్ పట్టణ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కంబాలపల్లి శ్రీశైలం (27) ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 1న కంబాలపల్లి శ్రీశైలం బైక్పై కడ్తాల్ గ్రామం నుంచి తన అత్తగారి ఊరైన యాచారం మండలం నల్లవెల్లి గ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యలోని యాచారం మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామ సమీపంలో రాగానే, శ్రీశైలం ప్రయాణిస్తున్న బైక్ను బోలేరా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీశైలం, ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కడ్తాల్ గ్రామానికి తీసుకురాగా, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు శ్రీశైలం మృతదేహంపై పూలు ఉంచి నివాళ్లార్పించారు.
అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ తరుపున జడ్పీటీసీ దశరథ్నాయక్ రూ. 5వేలు, గంప లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా రూ. 10 వేలు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ నర్సింహా, వార్డు సభ్యులు భిక్షపతి, మహేశ్, మల్లయ్య, నాయకులు చెన్నయ్య, రాంచంద్రయ్య, అంజి, శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు.