షాద్నగర్ : ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టిన ఘటన షాద్నగర్ బైపాస్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాద్నగర్ నుంచి బాలానగర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను షాద్నగర్ బైపాస్ రోడ్డు అన్నారం గేట్ సమీపంలో వెనుక నుంచి వస్తున్న వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయలయ్యాయి.
ఇందులో ఫరూఖ్నగర్ మండలం చిల్కమర్రి గ్రామానికి చెందిన వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు షాద్నగర్ సర్కారు దవాఖానకు తరలించారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.