ఇబ్రహీంపట్నం : అనుమానాస్పద స్థితిలో యువకుడు మంటల్లో కాలిపోయిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాజమహేంద్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన ముత్యాల శ్రీకాంత్ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం మంటలతో 80శాతం వరకు కాలిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే యువకుడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. యువకుడిని ఎవరో కాల్చివేశారని అతని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.