కులకచర్ల : పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన మహ్మదాబాద్ కృష్ణయ్య(35) గురువారం తన పొలంలో పనులు నిర్వహిస్తూ కింద పడిపోగా కుటుంబ సభ్యులు గమణించి 108కు సమాచారం అందించగా 108లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి వైద్యులు పరీక్షించగా కృష్ణయ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుడికి నోటిలో నుంచి నురుగులు రావడంతో పాముకాటుకు గురైనట్లు తెలిపారు.