షాద్నగర్ : దీపావళి పర్వదినాన పటాకుల నిప్పురవ్వలతో ప్రమాదవశాత్తు షాద్నగర్ వినాయకగంజ్లో ఉన్న గ్రంథాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి దీపావళి పర్వదినం పురస్కరించుకుని గ్రథాలయం సమీపంలో ఉన్న పలువురు పటాకులు కాలువగా వచ్చిన నిప్పురవ్వలు గాలిలోకి ఎగిరి పుస్తకాల గది కిటీకిల వద్ద పడ్డాయి. దీంతో సమీపంలో ఉన్న కాగితలు అంటుకుని పుస్తకాల గదికి మంటలు వ్యాపించడంతో గదిలో ఉన్న విలువైన పుస్తకాలు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇది ఇలా ఉంటే గ్రంథాలయ భవనాన్ని నూతనంగా నిర్మిస్తున్న నేపథ్యంలో తాత్కలికంగా వినాయక గంజ్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి గ్రంథాలయాన్ని తరలించారు. గ్రంథాలయ నిర్వాహనలో ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న అగ్నిప్రమాదంతో విలువైన పుస్తకాలు కాలిపోవడం చాలా బాధకరమని అన్నారు. పట్టణానికి చెందిన పలువురు విద్యావంతులు, నాయకులు, విద్యార్థులు ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకు వచ్చిన పుస్తకాలను బహుకరించాలని కోరారు.