పరిగి టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో వ్యక్తికి గాయాలైన సంఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టకోడురు గ్రామానికి చెందిన రాజీపురం శ్రీనివాస్(22) వృత్తిరిత్య పెయింటింగ్ వర్క్ పరిగిలో చేసేవాడు. పని ముగించుకొని స్వగ్రామానికి టీఎస్34జి6672 నంబర్ గల బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది.
దీంతో శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో వెంటనే పరిగి దవాఖానకు చికిత్సనిమిత్తం తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. బాధితుని తండ్రి అంజిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.