బొంరాస్ పేట: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి యువకుడు మృతిచెందిన సంఘటన బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని దుద్యాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దుద్యాలకు చెందిన మొహ్మద్ మొయిజ్(32) మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని గోపన్ చెరువులో శవమై తేలాడు. గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.