యాచారం, మే5: కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మండలంలో భువ నగిరి సీపీఎం అభ్యర్థి పర్యటన ఆదివారం కొనసాగింది. మంథన్ గౌరెల్లి, మాల్, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, మేడిపల్లి, నానక్నగర్, నల్లవెల్లి, చింతపట్ల, యాచారం తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ..దేశంలో బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యమ న్నా రు.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి, దేశంలో నరేంద్రమోదీ అసమర్థ పాలన కు సామాన్య ప్రజలు బలైపోతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీ అభ్యర్థి జాహంగీర్ మాట్లాడుతూ మతోన్మా దాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జంగా రెడ్డి, జాన్వెస్లీ, రామచంద్రయ్య, భాస్కర్, యాదయ్య, నర్సింహ, అంజయ్య, బ్రహ్మయ్య, తావునాయక్, పెద్దయ్య, అరుణ ఉన్నారు.
ఇబ్రహీంపట్నం, మే 5 : బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేయాలని యోచిస్తోందని బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం ఇబ్ర హీం పట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తీరు దేశానికి ఎంతో ప్రమాదకరమని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందన్నారు.
ఉపాధిహామీ పథకం రద్దుచేసే యోచనలో ఉన్న దని పేర్కొన్నారు. తెలంగాణకు ఇస్తామన్న బయ్యా రం ఉక్కుపరిశ్రమ, వరంగల్లో రైల్వేకోచ్సెంటర్లు మరిచిపోయిందన్నారు. అలాగే, ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేస్తామని ప్రకటించి, హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్ని స్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి భాస్కర్, పార్టీ రాష్ట నాయకులు సామెల్, జగదీశ్, జంగ య్య, బుగ్గరాములు పాల్గొన్నారు.