సిటీబ్యూరో: నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వాటర్బోర్డు పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలను గురించి ట్వీట్ చేశారు. వాటర్బోర్డు పేరుతో జరుగుతున్న ఈ కొత్త సైబర్ మోసాలకు అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు.
ప్రజల భయాన్ని ఉపయోగించి వ్యక్తిగత సమాచారం, డబ్బును దోచుకునే ఈ తరహా స్కామ్లపై అప్రమత్తంగా ఉంటేనే సైబర్నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. HMWSSB WATER BILL UPDATE.apk అనే పేరుతో అనుమానాస్పద లింకును పంపి దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారన్నారు. ఇది అసలు అధికారిక యాప్ కాకుండా మాల్వేర్తో కూడిన ఫేక్ ఏపీకే ఫైల్ అని, ఇన్స్టాల్ చేస్తే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.