పరిగి : టీనేజర్లు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేస్తున్న టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. రెండు డోసులు టీకాలు వేయించుకుంటే కరోనా సోకినా ప్రాణాపాయం ఉండదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి టీకా వేయించుకునేలా చూడాలని ప్రిన్సిపాల్కు సూచించారు.
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా కళాశాల ఆవరణలో ఈ నెల 7వ తేదీ శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్కు ఎమ్మెల్యే సూచించారు. జూనియర్ కళాశాలలో గణితం లెక్చరర్ లేకపోవడంతో గణితం బోధించే అధ్యాపకుడికి జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్కుమార్రెడ్డి ప్రతినెల రూ. 5వేలు అందజేస్తానని ప్రకటించి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చేతులమీదుగా ప్రిన్సిపాల్కు చెక్కు అందజేశారు. పేద విద్యార్థుల చదువుల కోసం సహకరిస్తున్న జడ్పీటీసీని ఎమ్మెల్యే అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, రవికుమార్, జగదీశ్వర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.